కరకట్టపై కాన్వాయ్ ఆపి సామాన్యుల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉండవల్లిలోని నివాసం నుంచి సచివాలయానికి వెళుతుండగా, రోడ్డు పక్కన ప్రజలను చూసి తన కాన్వాయ్ ఆపారు. సామాన్య ప్రజలను కలుసుకుని, వారి సమస్యలు తెలుసుకున్నారు. వారు అందించిన వినతులను స్వీకరించి, సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు కరకట్టపై తన కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరి నుంచి వినతులను తీసుకుని హామీ ఇవ్వడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు.

Chandrababu
Convoy
Karakatta
TDP
Andhra Pradesh

More Telugu News